by సూర్య | Wed, Jan 12, 2022, 09:38 PM
సంక్రాంతి పండుగ సందర్భంగా 8 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 13న విజయవాడ-మచిలీపట్నం రైలు, విజయవాడ-నర్సాపూర్ రైలు, మచిలీపట్నం-గుడివాడ రైలు, గుడివాడ-మచిలీపట్నం రైళ్లు నడపనున్నట్లు తెలిపారు.ఈ నెల 14వ తేదీన నర్సాపూర్-విజయవాడ రైలు , మచిలీపట్నం-గుడివాడ రైలు,గుడివాడ-మచిలీపట్నం రైలు, మచిలీపట్నం-విజయవాడ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి అని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
Latest News