by సూర్య | Wed, Jan 12, 2022, 08:55 PM
పాలనలో పలు సంచలన నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇ తాజాగా ఏపీలో మహిళా పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేస్తూ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మహిళా పోలీస్ విభాగంలో 90 శాతం డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా మారుస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు సర్వీసు నిబంధనలు, పోస్టుల కేటగిరీని ప్రకటిస్తూ బుధవారం సాయంత్రం ఏపీ హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే, సచివాలయ మహిళా పోలీసులకు ప్రమోషన్లపై కూడా వివరణ ఇచ్చింది. ఈ మహిళా పోలీస్ విభాగంలో మొత్తం ఐదు కేటగిరీలుగా పోస్టులు ఉండనున్నాయి. మహిళా పోలీస్ ఇన్స్పెక్టర్ నాన్ గెజిటెడ్, మహిళా పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, మహిళా పోలీస్ ఏఏస్ఐ, సీనియర్ మహిళా పోలీస్, మహిళా పోలీస్గా ఉద్యోగ కేటగిరీలు ఉంటాయని నోటిఫికేషన్లో ఏపీ హోంశాఖ పేర్కొంది. మహిళా హోంగార్డులను 5 శాతం మేర, గ్రామ, వార్డు మహిళా వాలంటీర్ల నుంచి 5 శాతం మందిని మహిళా పోలీస్ విభాగంలో భర్తీ చేస్తామని స్పష్టం చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న గ్రామ, వార్డు సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా రీ-డిజిగ్నేట్ చేస్తామని ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొంది.
Latest News