by సూర్య | Wed, Jan 12, 2022, 07:26 PM
నెల్లూరు జిల్లాలోని దుత్తలూరు మండలం ముత్తరాసుపల్లి సమీపంలో రోడ్ ఆక్సిడెంట్ జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడి ఓ మహిళ మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Latest News