by సూర్య | Wed, Jan 12, 2022, 05:41 PM
ఏపీలో కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తుంది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 3,205 మందికి కరోనా సోకింది. విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 695 కేసులు నమోదు కాగా, కడప జిల్లాలో అత్యల్పంగా 42 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 281 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో సహా దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 20,87,879కి చేరుకుంది. ఇప్పటివరకు 20,63,255 మంది కరోనా నుంచి కోలుకోగా... 14,505 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10,119 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Latest News