నడిరోడ్డుపై మహిళ వీరంగం.. ఏం చేసిందంటే

by సూర్య | Wed, Jan 12, 2022, 03:28 PM

భోపాల్ లోని అయోధ్య బైపాస్ ఏరియాలో ఓ మహిళ వీరంగం సృష్టించింది. తోపుడు బండిపై పండ్లు అమ్ముకుంటున్న ఓ వ్యక్తిపై విరుచుకుపడింది. బండిపై ఉన్న పండ్లను నేలపాలు చేసింది. పండ్ల బండి నుంచి పండ్లను ఒక్కొక్కటిగా తీసి రోడ్డుకేసి కొట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. ఆ మహిళ కారుకి పండ్ల వ్యాపారి బండి తగలడం వల్ల కారుకు కొద్దిగా గీతలు పడ్డాయి. పండ్ల వ్యాపారి పరిహారంగా డబ్బు ఇస్తానని చెప్పినా ఆమె వినలేదు. చివరకు అతని బండిపై పండ్లు అన్నింటినీ నేలపాలు చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మహిళ తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు.

Latest News

 
చంద్రబాబుపై సీఎం జగన్ విమర్శల వర్షం Fri, Mar 29, 2024, 08:38 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు Fri, Mar 29, 2024, 08:36 PM
అక్రమంగా మద్యం కలిగి ఉన్న వ్యక్తి అరెస్ట్ Fri, Mar 29, 2024, 08:35 PM
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వాహనం తనిఖీ Fri, Mar 29, 2024, 08:34 PM
ఎమ్మెల్యే ఆర్కే వాహనం తనిఖీ చేసిన పోలీసులు Fri, Mar 29, 2024, 08:32 PM