by సూర్య | Wed, Jan 12, 2022, 03:28 PM
భోపాల్ లోని అయోధ్య బైపాస్ ఏరియాలో ఓ మహిళ వీరంగం సృష్టించింది. తోపుడు బండిపై పండ్లు అమ్ముకుంటున్న ఓ వ్యక్తిపై విరుచుకుపడింది. బండిపై ఉన్న పండ్లను నేలపాలు చేసింది. పండ్ల బండి నుంచి పండ్లను ఒక్కొక్కటిగా తీసి రోడ్డుకేసి కొట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ మహిళ కారుకి పండ్ల వ్యాపారి బండి తగలడం వల్ల కారుకు కొద్దిగా గీతలు పడ్డాయి. పండ్ల వ్యాపారి పరిహారంగా డబ్బు ఇస్తానని చెప్పినా ఆమె వినలేదు. చివరకు అతని బండిపై పండ్లు అన్నింటినీ నేలపాలు చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మహిళ తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు.
Latest News