by సూర్య | Wed, Jan 12, 2022, 02:28 PM
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు గవర్నర్ బిష్వభూషన్ హరిచందన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భగా సోము వీర్రాజు ఆత్మకూరు ఘటనపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టిన వారిని ప్రభుత్వం వెనకేసుకొస్తోందని, ఆత్మకూరులో బీజేపీ నేత శ్రీకాంత్ రెడ్డిని చంపాలనే ప్రయత్నం చేశారని ఆయన అన్నారు. పోలీసులే శ్రీకాంత్ రెడ్డిని రక్షించి.. ఆ తర్వాత అతని పైనే 307 కేసు పెట్టారంటే ఏమనుకోవాలి..? అని ప్రశ్నించారు. ఆత్మకూరు ఘటన విషయంలో గవర్నర్ చొరవ తీసుకోవాలని, ఆత్మకూరు ఘటనను దేశ భక్తులకు, దేశ ద్రోహులకు మధ్య జరిగిన ఘటనగా చూడాలన్నారు. సీఎం దేశభక్తులకు సహకరిస్తారా..? లేదా దేశ ద్రోహులకు సహకరిస్తారా..? అనేది తేల్చుకోవాలన్నారు.
Latest News