by సూర్య | Wed, Jan 12, 2022, 02:20 PM
విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. పార్వతీపురం మండలం కొత్తవలస మణికంఠ కాలనీకి చెందిన కర్రా జోగారావు (50) స్థానికంగా ఉన్న ఓ కర్రల మిల్లులో వాచ్ మెన్ గా పనిచేస్తుంటారు. మూడు రోజుల నుంచి కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. ఈ క్రమంలో పట్టణ రైల్వేస్టేషన్ సమీపంలో నీటికుంటలో అతని మృతదేహాన్ని మంగళవారం గుర్తించారు. ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్లు బాధితులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై ఎం. సత్యనారాయణ తెలిపారు.
Latest News