by సూర్య | Wed, Jan 12, 2022, 02:17 PM
విజయనగరం: బొబ్బిలి యువ రాజు, టీడీపీ నియోజకవర్గం ఇంచార్జి రంగారావు( బేబీ నాయన) కరోనా పాజిటివ్ వచ్చింది. మంగళవారం స్వల్ప జ్వరంతో బాధపడుతున్న ఆయన..టెస్ట్ చేయించుకున్నారు. దీంతో కోవిడ్ పాజిటివ్ గా వచ్చింది. దీంతో గత రెండు, మూడు రోజులుగా తనను కలిసిన వారు టెస్ట్ చేయించుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించి ఐసొలేషన్ లో ఉండాలని బేబీ నాయన కోరారు. నియోజకవర్గంలో ప్రజలు ఆరోగ్యం పై దృష్టి పెట్టి జాగ్రత్తలు తీసికోవాలన్నారు.
Latest News