by సూర్య | Wed, Jan 12, 2022, 12:39 PM
ఆంధ్రప్రదేశ్ లో పలువురు ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ సైతం కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన ఏఐజీలో చేరి చికిత్స పొందుతున్నారు. రాధా ఈ నెల 9న కంచికచర్లలో రంగా విగ్రహావిష్కరణకు హాజరు కాగా ఇందులో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు.
Latest News