by సూర్య | Wed, Jan 12, 2022, 12:24 PM
సచివాలయ ఉద్యోగులందరూ ఆందోళన విరమించి వెంటనే విధుల్లో చేరాలని రాష్ట్ర హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్జైన్ అన్నారు. రాష్ట్రంలో అన్ని అర్హతలు ఉన్న 60 వేల మంది సచివాలయ ఉద్యోగులున్నట్లు గుర్తించామని, మిగిలిన వారు అర్హత సాధించిన వెంటనే ప్రొబేషన్ ప్రకటిస్తామని అన్నారు. సీఎం జగన్ ప్రత్యేకంగా చేపట్టిన నియామక ప్రక్రియ ఇది, ఎవరికీ అన్యాయం జరగబోదని అన్నారు. 11 శాఖలతో అనుబంధమున్న విభాగాలున్నందున ప్రక్రియ కాస్త ఆలస్యం అవుతోందని వివరించారు. జూన్ ఆఖరులోగా డిక్లరేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తామన్నారు. సచివాలయ ఉద్యోగులను కొందరు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి అపోహలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
Latest News