ఎంపీ రఘురామ ఇంటికి సీఐడీ పోలీసులు

by సూర్య | Wed, Jan 12, 2022, 12:04 PM

వైసీపీ రెబల్ ఎపీ రఘురామకృష్ణంరాజు ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు వచ్చారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎంపీ నివాసానికి నలుగురు పోలీసులు వచ్చి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గతంలో ఆయనపై కేసు నమోదు అయింది. ఆ కేసు విషయంలో రేపు విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా, తన సొంత నియోజకవర్గం నరసాపురం పర్యటనకు రేపు వెళ్తున్నట్లు ఇప్పటికే రఘురామ ప్రకటించారు. రెండు రోజులపాటు నియోజకవర్గంలో ఉంటానని చెప్పారు.

Latest News

 
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి: కలెక్టర్ Fri, Apr 19, 2024, 11:39 AM
శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయానికి రూ. 58వేలు విరాళం Fri, Apr 19, 2024, 11:39 AM
త్వరలోనే ఏపీకి ప్రధాని మోదీ Fri, Apr 19, 2024, 11:17 AM
వైకాపాను వీడి టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 10:16 AM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 10:13 AM