by సూర్య | Wed, Jan 12, 2022, 12:04 PM
వైసీపీ రెబల్ ఎపీ రఘురామకృష్ణంరాజు ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు వచ్చారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎంపీ నివాసానికి నలుగురు పోలీసులు వచ్చి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గతంలో ఆయనపై కేసు నమోదు అయింది. ఆ కేసు విషయంలో రేపు విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా, తన సొంత నియోజకవర్గం నరసాపురం పర్యటనకు రేపు వెళ్తున్నట్లు ఇప్పటికే రఘురామ ప్రకటించారు. రెండు రోజులపాటు నియోజకవర్గంలో ఉంటానని చెప్పారు.
Latest News