by సూర్య | Tue, Jan 11, 2022, 08:29 PM
దేశ రాజధాని న్యూఢిల్లీలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. మంగళవారం ఢిల్లీలో 21,000 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.కరోనాతో 23 మంది మరణించినట్లు వైద్య అధికారులు తెలిపారు. సోమవారం నాటికి 19,166 కోవిడ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలో రోజువారీ కోవిడ్ పాజిటివిటీ రేటు 25.65 శాతంగా ప్రభుత్వం పేర్కొంది. నగరంలో కోవిడ్-19 యాక్టివ్ కేసుల సంఖ్య 9,000కు పైగా పెరిగిందని, ఇప్పుడు 74,881కి చేరుకుందని ప్రభుత్వం తెలిపింది.
Latest News