నైట్ కర్ఫ్యూ నిర్ణయం నుంచి ఏపీ సర్కార్ వెనక్కి

by సూర్య | Tue, Jan 11, 2022, 06:01 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విషయంలో రోజుకో వార్త తెరపైకి వస్తోంది. ఏపీలో నైట్ కర్ప్యూకు నిర్ణయం తీసుకొన్న ఏపీ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని రద్దు చేసుకొంది. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి, ఒమిక్రాన్ కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని నేటి నుంచి నైట్ కర్ఫ్యూ విధించాలని ఇటీవల ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయాలని భావించింది. అయితే, నైట్ కర్ఫ్యూ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్టు నేడు తెలిపింది. ఏపీలో సంక్రాంతి తర్వాత రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేసేందుకు ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. దాంతో, ఈ నెల 18 నుంచి రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయనున్నారు. కర్ఫ్యూపై ఇటీవల ఇచ్చిన ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు సవరణ చేసింది. దీనిపై ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజలు గ్రామీణ ప్రాంతాలకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని వెల్లడించారు. ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే నైట్ కర్ఫ్యూ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. మూడో దశ వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించాలని పేర్కొన్నారు. మాస్కులు ధరించకపోతే రూ.100 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. కరోనా కట్టడిలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు.

Latest News

 
కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రమే నామినేషన్ Wed, Apr 24, 2024, 03:21 PM
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Wed, Apr 24, 2024, 02:39 PM
కాకినాడలో పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం Wed, Apr 24, 2024, 01:42 PM
మద్యంలో విషం కలుపుకొని తాగిన రైతు Wed, Apr 24, 2024, 01:42 PM
మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి Wed, Apr 24, 2024, 01:42 PM