విషాదం.. ఫ్యానుకు ఉరివేసుకొని మహిళ ఆత్మహత్య

by సూర్య | Tue, Jan 11, 2022, 04:28 PM

విశాఖలోని ఎంవీపీ స్టేషన్ పరిధిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకొని మృతిచెందింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎం. వి.పి. కాలనీ సెక్టార్-6లో దూడ ఉపేంద్ర, సుగుణ(24) కలిసి ఉంటున్నారు. ఉపేంద్ర ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం ఉదయం విధులు నిర్వహించి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఉపేంద్ర తలుపులు కొట్టినా సుగుణ తీయకపోవడంతో ఇంటి యజమానితో కలిసి ఇంటి వెనుక వైపు వెళ్లి చూడగా ఆమె ఫ్యానుకు చీరతో ఉరివేసుకొని ఉంది.


అప్పటికే ఆమె మృతిచెందడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సి. ఐ రమణయ్య, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీ హెచ్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

 
వేమిరెడ్డి చాలా రిచ్.. ఆస్తుల విలువ తెలిస్తే నోరెళ్లబెడతారు, అఫిడవిట్ వివరాలివే Fri, Apr 19, 2024, 07:54 PM
మర్రిచెట్టు తొర్రలో నోట్ల కట్టలు.. అక్కడికి ఎలా వచ్చాయో తెలిస్తే Fri, Apr 19, 2024, 07:50 PM
కేఏ పాల్ ఆస్తులు మరీ అంత తక్కువా.. కేసులు మాత్రం Fri, Apr 19, 2024, 07:46 PM
ఇష్టం లేకపోయినా అక్కడ పోటీ చేస్తున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న టీడీపీ అభ్యర్థి Fri, Apr 19, 2024, 07:42 PM
ఆ నాలుగు చోట్లా అభ్యర్థుల్ని మార్చేస్తున్న టీడీపీ?.. ఆయనకు మాత్రం బంపరాఫర్! Fri, Apr 19, 2024, 07:38 PM