by సూర్య | Tue, Jan 11, 2022, 02:23 PM
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ఎయిడెడ్ సంస్థ అయిన గాంధీనగర్(గుజరాత్) లోని ఇన్స్ స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్(ఐపీఆర్) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సంస్థలో ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలో అప్లికేషన్ గడువు ముగియనుండటంతో ఈ నోటిఫికేషన్ వివరాలు మీకోసం..
*మొత్తం పోస్టులు- 81
*అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ(ఫిజిక్స్) ఉత్తీర్ణత
*వయసు: 35 ఏళ్లకు మించకుండా ఉండాలి.
*జీతం: నెలకి రూ.20,000 + హెచ్ఆర్ఏ చెల్లిస్తారు.
*ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ
*దరఖాస్తు విధానం: ఆన్ లైన్
*దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.200 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
*దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 17, 2022
వెబ్ సైట్: https://www.ipr.res.in/
Latest News