by సూర్య | Tue, Jan 11, 2022, 01:52 PM
రైతుభరోసా- పీఎం కిసాన్ కింద మూడోవిడత పెట్టుబడి సాయాన్ని ఏపీ సర్కార్ అందించింది. వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోంది. ఇందులో మొదటి విడతగా ఖరీఫ్ పంట వేసే ముందు అంటే మే నెలలో రూ. 7,500, రెండవ విడతగా అక్టోబర్ నెల ముగిసేలోపే ఖరీఫ్ పంట కోత సమయం, రబీ అవసరాల కోసం రూ. 4,000, మూడవ విడతగా ధాన్యం ఇంటికి చేరే సంక్రాంతి వేళ జనవరి నెలలో రూ. 2,000 చొప్పున ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తోంది. అర్హత ఉండి రాని వారు రైతుభరోసా కేంద్రాల్లోకి వెళ్లి నమోదు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
Latest News