by సూర్య | Tue, Jan 11, 2022, 01:40 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పరిపాలన శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ను విజయవాడలో కర్నూలు నగర మేయర్ బి. వై. రామయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. కర్నూలు నగర సమస్యలపై, దానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనుల గురించి చర్చించారు.
ఇంజినీరింగ్ విభాగంలో ఏఈ, డిఈఈల కొరత, ఆరోగ్య మరియు వైద్య విభాగంలో పారిశుద్ధ్య కార్మికుల కొరత, నగర త్రాగునీరు ఎద్దడి నివారణకై గతంలో నగర పాలక సంస్థ రూపొందించిన ప్రతిపాదనల ఆమోదం వంటి కీలక సమస్యలపై చర్చించారు.
Latest News