by సూర్య | Tue, Jan 11, 2022, 12:49 PM
దక్షిణ భారత దేశంలో ఎక్కువగా లోకల్ పార్టీలకే మద్దతు చూపుతుంటారు ప్రజలు. తాజాగా ఇటీవల కాలంలో తమిళనాడు లో జరిగిన ఎన్నికలలో M.K. స్టాలిన్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరచిన సంగతి అందరికి తెలిసిందే. తాను భాద్యతలు స్వీకరించిన సమయం నుండి తన దైన శైలిలో పరిపాలన చేస్తూ పక్క రాష్ట్రాలకు కూడా ఒక మోడల్ గా ఉన్నారు. ఐతే పెరుగుతున్న కరోనా కారణంగా అందరూ టీకా వేయించుకోవాలి అని, "నేను ఫ్రంట్లైన్ ఉద్యోగిగా ఈరోజు #BoosterDose తీసుకున్నాను. అన్ని ఫ్రంట్లైన్ కార్మికులు మరియు 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు సహ-అనారోగ్యాలతో ఉన్నవారు క్రమం తప్పకుండా బూస్టర్ డోస్ను పొందాలి. టీకా కవచంతో మనల్ని మనం రక్షించుకుంటాం; దేశాన్ని కూడా కాపాడుకుందాం!". అంటూ తాను టీకా తీసుకున్న ఫోటోని జోడించి తన ప్రజలకు మరియు ఫ్రంట్లైన్ అధికారులకు పిలుపునిచ్చారు.
Latest News