by సూర్య | Tue, Jan 11, 2022, 12:33 PM
గుంటూరు జిల్లా తాడేపల్లి లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను మంగళవారం విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి కలిసారు. ఫిబ్రవరి 7 నుంచి 11 వరకు శ్రీ శారదా పీఠంలో వార్షిక మహోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు వార్షిక మహోత్సవ ఆహ్వన పత్రికను స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చారు. స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామితో పాటు ముఖ్యమంత్రిని కలిసినవారిలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు.
Latest News