by సూర్య | Tue, Jan 11, 2022, 12:29 PM
గుంటూరు: ఆకుపచ్చ జెండా చేతపట్టుకున్నందుకు అన్నదాతలు గర్వపడాలని మాజీ ఎమ్యెల్యే జివి ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయం నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆకుపచ్చ జెండా పక్కన నిరసన నల్లజెండా పట్టుకున్న అందుకు రైతుల రక్తం ఉడికి పోవాలని అన్నదాతల నిరసన ఈ ప్రభుత్వానికి కనువిప్పు కావాలన్నారు. వినుకొండ పట్టణంలో రైతు నిరసన ర్యాలీ తో పాటుగా నష్టపోయిన పంటను ఆయన పరిశీలించారు. అనంతరం రైతు ర్యాలీకి పెద్ద ఎత్తున వచ్చిన 5 మండలాల రైతు నాయకులు, టిడిపి నాయకులు, అభిమానులను శుభాకాంక్షలు తెలియచేసారు.
Latest News