నిన్న కేసులు తగ్గిన...మరణాలు మాత్రం పెరిగాయ్

by సూర్య | Tue, Jan 11, 2022, 12:07 PM

దేశంలో కరోనా వ్యాప్తి విస్త్రుతంగా సాగుతున్నా ఆదివారంనాడు కాస్త తగ్గినట్లు కనిపించింది. దీనికి కారణం ఆదివారం సెలవు దినంగా కావడం కూడా కావచ్చు. కానీ మరణాలు మాత్రం పెరిగాయని వైద్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వారాంతం కావడం, టెస్టింగ్ సంఖ్యను తగ్గించడం వంటి పలు కారణాలతో దేశంలో 14 రోజుల తర్వాత రోజువారీ కేసులు మొదటిసారి తక్కువగా నమోదయ్యాయి. కానీ, మరణాలు పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. సోమవారం దేశవ్యాప్తంగా 1,66,497 కొత్త కేసులు బయటపడగా.. ముందు రోజు 1,80,078తో పోల్చితే ఇవి 7.5 శాతం తక్కువ. కానీ, ఆదివారం టెస్టింగ్ శాతం తగ్గడమే అందుకు కారణం. శనివారంతో పోల్చితే ఆదివారం టెస్టింగ్‌లు 14 శాతం తగ్గిపోయాయి. మరణాలు మాత్రం క్రమంగా పెరుగుతున్నాయి. గతవారం రోజువారీ కోవిడ్ కేసులు ఆరు రెట్లు పెరిగాయి. జనవరి 3-9 మధ్య 7.8 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా వైరస్ మొదలైన ఇంత రెట్టింపులో పెరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఓవైపు, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి దేశంలో థర్డ్ వేవ్‌కు ఆజ్యం పోస్తోంది. డిసెంబరు 27 నుంచి జనవరి 9 వరకూ 13 రోజులూ కేసులు పెరుగుతూ వచ్చాయి. అటు, మరణాలు గతవారం రోజుల నుంచి 200కిపైగా నమోదయ్యాయి. అంతకు ముందు వారంతో పోల్చితే ఇది 66 శాతం అధికం. కానీ, గత రెండు వేవ్‌ల కంటే దేశంలో ప్రస్తుతం కరోనా మరణాలు తక్కువగా నమోదవుతున్నాయి. సోమవారం మహారాష్ట్రలో 33,470 కొత్త కేసులు నిర్ధారణ కాగా.. ముంబయిలోనే 13,648 కేసులు ఉన్నాయి. ఆ రాష్ట్రంలో ఈ సంఖ్య ముందు రోజుతో పోల్చుకుంటే 25 శాతం తక్కువ. అంటు, బెంగాల్, ఢిల్లీ, కేరళ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లోనూ సోమవారం కరోనా కేసులు తగ్గాయి. పశ్చిమ్ బెంగాల్‌లో 19,286, ఢిల్లీలో 19,166, కేరళలో 5,797, ఆంధ్రప్రదేశ్‌లో 984 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. అసోం, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, హరియాణా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మాత్రం కేసులు పెరగడం గమనార్హం. అసోంలో కేసులు రెట్టింపయ్యాయి. అక్కడ 2,198 కేసులు సోమవారం నమోదయ్యాయి. తమిళనాడు 13,990, యూపీ 8,334, రాజస్థాన్ 6.097, హరియాణా 5,736, చత్తీస్‌గఢ్ 4,120, మధ్యప్రదేశ్ 2,317 కేసులు వెలుగుచూశాయి.

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM