మార్కెట్ లోకి టైటాన్ ఐప్లస్ స్మార్ట్ కళ్లద్దాల విడుదల...దీని ప్రత్యేకతలు ఎన్నో

by సూర్య | Tue, Jan 11, 2022, 12:05 PM

మార్కెట్ లోకి రోజుకో ఆధునికత కలిగిన వస్తువు వస్తోంది. తాజాగా  టాటా గ్రూపు కంపెనీ అయిన టైటాన్ ఐప్లస్ తొలిసారిగా స్మార్ట్ కళ్లద్దాలను విడుదల చేసింది. దీని పేరు టైటాన్ ఐఎక్స్. కళ్లజోడు స్పీకర్లను అమర్చడం విశేషం. సన్ గ్లాసెస్, స్పెక్టకిల్స్, కంప్యూటర్ గ్లాస్.. ఇలా మూడు విధాలుగా దీన్ని ఉపయోగించుకోవచ్చని టైటాన్ ఐప్లస్ తెలిపింది. టైటాన్ ఐఎక్స్ ధర రూ.9,999. అన్ని టైటాన్ స్టోర్లలోను ఇది లభిస్తుంది. మిడ్ నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్ ఒక్కటే ఉంది. ఈ కళ్లజోడుకు ఓపెన్ స్పీకర్లు ఉంటాయి. కనుక చక్కని సంగీతాన్ని స్టీరియో మోడ్ లో ఆస్వాదించొచ్చు. బ్యాటరీ ఒక్కసారి రీచార్జ్ చేస్తే ఎనిమిది గంటల పాటు ఆడియో వినొచ్చు. క్వాల్ కామ్ ప్రాసెసర్ ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఫోన్లకు దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక యాప్ ఉంటుంది. ఈ ఫోన్లో క్లియర్ వాయిస్ క్యాప్చర్ (సీవీసీ) టెక్నాలజీని తీసుకొచ్చారు. దీంతో స్వర నాణ్యత మెరుగ్గా ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఇందులో ఫిట్ నెస్ ట్రాకర్ కూడా ఉంది. పెడోమీటర్ ను ఏర్పాటు చేశారు. రోజూ ఎన్ని అడుగులు నడిచిందీ, తద్వారా ఎన్ని కేలరీలు ఖర్చయిందీ ఇందులో రికార్డ్ చేసుకోవచ్చు. కళ్లజోడుకు ఉన్న టచ్ కంట్రోల్ తో కాల్స్ మాట్లాడుకోవచ్చు. సెల్ఫీ కూడా తీసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. ఒకవేళ కళ్లజోడు ఎక్కడో పెట్టి మర్చిపోతే వెతుక్కునే ఫీచర్ కూడా ఇందులో ఉంది.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM