by సూర్య | Tue, Jan 11, 2022, 11:41 AM
కృష్ణా జిల్లా మున్నేరులో గల్లంతైన ఐదుగురి విద్యార్థుల మృతదేహాలు వెలికిశారు. చందర్లపాడు మండలం ఏటూరు వద్ద మున్నేరులో......నిన్న ఐదుగురు గల్లంతయ్యారు. ఇవాళ....ఐదుగురి మృతదేహాలూ లభ్యమయ్యాయి. మున్నేరులో ఇసుక కోసం తవ్విన గుంతలో.....మృతదేహాలు దొరికాయి. ఎన్డీఆర్ ఎఫ్, పోలీసు, రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో....గాలింపు చర్యలు నిర్వహించారు. గ్రామానికి చెందిన 8 నుంచి 13 ఏళ్ల మధ్య వయసు కలిగిన పిల్లలు...నిన్న మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి మున్నేరు వైపు వెళ్లారు. సంక్రాంతి సెలవులు కావడంతో.....ఆడుకోవడానికి వెళ్లినట్లు తల్లిదండ్రులు భావించారు. కానీ రాత్రి గడుస్తున్నా.....తిరిగి రాకపోవడంతో...ఆందోళనతో గాలింపు చేపట్టారు. ఇప్పుడు ఆ ఐదుగురి మృతితో.....గ్రామంలో విషాదం నొలకొంది.
Latest News