కరోనా వేళ తప్పదు మరి...డిజిటల్ ప్రచారానికి పార్టీల సన్నాహాలు

by సూర్య | Mon, Jan 10, 2022, 08:30 PM

కరోనా సమయంలో ఎన్నికలు రావడం, సభలు, ర్యాలీలు  వద్దని కేంద్ర ఎన్నికల కమిషన్ వారించడంతో రాజకీయ పార్టీలు డిజిటల్ ప్రచారాల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే మానసికంగా సిద్దమైన పార్టీలు అందుకు అనుగుణంగా పార్టీ నేతలను సమాయత్తం చేస్తున్నాయి. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే కోవిడ్ కేసులు కారణంగా ఈ నెల 15 వరకు రోడ్ షోలు, పాదయాత్రలు, ర్యాలీలు నిర్వహించేందుకు పర్మిషన్ లేదని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. ఆ తర్వాత పరిస్థితిని బట్టి యాత్రలు, ర్యాలీలకు అనుమతించే విషయంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. దీంతో పోటీలో నిలిచే పార్టీలు ప్రత్యామ్నాయ ప్రచార మార్గాలపై దృష్టి సారించాయి. వర్చువల్ క్యాంపెయిన్స్ నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీల నేతలు వర్చువల్ ప్రచారాలపై దృష్టి సారించాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ వంటి పార్టీలు సోషల్ మీడియాలో వేర్వేరు అంశాలపై ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ గ్రీన్ రూమ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలోని పార్టీ హెడ్ క్వార్టర్స్‌లో గ్రీన్ రూమ్‌‌ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేసింది. ఇక్కడ నుంచి అన్ని రాష్ట్రాల నేతలు వర్చువల్‌గా ప్రజలతో కనెక్ట్ కానున్నారు. అదేసమయంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ద్వారా డిజిటల్ క్యాంపెయిన్‌ కూాడా చేయనుంది. ఇదిలావుంటే యూపీలో త్రీడీ టెక్నాలజీని ఉపయోగించుకుని వర్చువల్‌ ర్యాలీలు నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమవుతుంది. పార్టీ నాయకులు వేర్వేరు చోట్ల నుంచి పాల్గొన్నా ఒకే వేదికపై ఉన్నట్లుగా చూపించడం దీనిలో సాధ్యమవుతుంది. అలాగే ఇక వాట్సప్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్ ద్వారా కూడా బూత్‌స్థాయి బృందాలతో సమావేశాలు నిర్వహించనున్నారు. అలాగే సమాజ్‌వాదీ పార్టీ వారి కార్యకర్తలకు డిజిటల్‌ వినియోగంపై శిక్షణ అందిస్తోంది. కాగా యూపీ అసెంబ్లీ గడువు మే 14తో ముగుస్తుండగా, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీల కాలపరిమితి మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలో యూపీలో ఏడు దశల్లో, మణిపూర్‌లో రెండు దశల్లో, గోవా, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.

Latest News

 
వేమిరెడ్డి చాలా రిచ్.. ఆస్తుల విలువ తెలిస్తే నోరెళ్లబెడతారు, అఫిడవిట్ వివరాలివే Fri, Apr 19, 2024, 07:54 PM
మర్రిచెట్టు తొర్రలో నోట్ల కట్టలు.. అక్కడికి ఎలా వచ్చాయో తెలిస్తే Fri, Apr 19, 2024, 07:50 PM
కేఏ పాల్ ఆస్తులు మరీ అంత తక్కువా.. కేసులు మాత్రం Fri, Apr 19, 2024, 07:46 PM
ఇష్టం లేకపోయినా అక్కడ పోటీ చేస్తున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న టీడీపీ అభ్యర్థి Fri, Apr 19, 2024, 07:42 PM
ఆ నాలుగు చోట్లా అభ్యర్థుల్ని మార్చేస్తున్న టీడీపీ?.. ఆయనకు మాత్రం బంపరాఫర్! Fri, Apr 19, 2024, 07:38 PM