by సూర్య | Mon, Jan 10, 2022, 06:37 PM
దేశంలో కరోనా థర్డ్ వేవ్ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. తాజాగా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా కరోనా బారిన పడ్డారు. రాజ్నాథ్ సింగ్ తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్నారని, కరోనాకు పాజిటివ్ అని తేలిందని వెల్లడించారు. ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు. ఇటీవలి కాలంలో తనను కలిసిన ప్రతి ఒక్కరూ ఐసోలేషన్లో ఉండాలని, తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
Latest News