by సూర్య | Thu, Nov 25, 2021, 12:14 AM
గురువారం నెల్లూరు జిల్లాలో వరద ప్రాంతాలను తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పరిశీలించనున్నారు. మధ్యాహ్నం చంద్రబాబు నెల్లూరు చేరుకుని అక్కడి నుంచి ఇందుకూరుపేట, కోవూరు, నెల్లూరు సిటీ పరిధిలోని భగత్సింగ్ కాలనీ, తదితర ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితులను పరామర్శించనున్నారు. ఆ తరువాత చంద్రబాబు సాయంత్రం 6 గంటలకు రోడ్డు మార్గాన గుంటూరు వెళ్లనున్నారు.
Latest News