by సూర్య | Wed, Nov 24, 2021, 01:47 PM
దేశంలో కొవిడ్ క్రియాశీల కేసులు 537 రోజుల కనిష్టానికి దిగివచ్చాయి. మంగళవారం ఉదయం 8గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు దేశంలో కొత్తగా 9వేల283కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. వీటితో కలిపి. దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య.... 3 కోట్ల 45 లక్షల 35 వేల 763కి పెరిగింది. కరోనాతో మరో 437 మంది చనిపోగా. ఇప్పటివరకు 4 లక్షల 66 వేల 584 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 10 వేల 949 మంది.వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో లక్షా 11 వేల 481 కరోనా క్రియాశీల కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
Latest News