by సూర్య | Tue, Nov 23, 2021, 02:59 PM
వరద ప్రభావిత ప్రాంతాల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. తొలుత రెండు రోజులు పర్యటనగా నిర్ణయించినప్పటికీ. మరో రోజు పొడిగించారు. వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో నేడు కడప, రేపు చిత్తూరు, ఎల్లుండి నెల్లూరు జిల్లాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. ఇప్పటికే కడపకు చేరుకున్న చంద్రబాబు. కాసేపట్లో రాజంపేట, నందలూరు మండలాల్లో పర్యటించనున్నారు. మందపల్లి, పులపత్తూరు, తొగూరుపేట, గుండ్లూరు గ్రామాల్లో పర్యటించి... బాధితులను పరామర్శించనున్నారు.
Latest News