by సూర్య | Tue, Nov 23, 2021, 09:34 AM
తాళ్లరేవు మండలంజాతీయ రహదారిపై గణపతినగర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం. శంకరయ్యపేట పెద్దాపురం బంగారమ్మ గుడి వీధికి చెందిన పీతల దుర్గాప్రసాద్, దాసరి నాగేంద్ర సోమవారం ద్విచక్రవాహనంపై యానాం వచ్చారు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో ముందు వెళ్తున్న కారును ఓవర్టేక్ చేస్తుండగా మోటార్సైకిల్ బోల్తా పడింది. దుర్గాప్ర సాద్ (21) తల రోడ్డుకు తగలడంతో మెదడు బయటకు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నాగేంద్రకు ఎలాంటి గాయాలు కాలేదు. కోరంగి ఎస్సై రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Latest News