by సూర్య | Tue, Nov 23, 2021, 08:57 AM
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరందుకుంది. ఇటీవలే 100 కోట్ల డోస్ పూర్తయింది. కేవలం 9 నెలల్లోనే భారత్ ఈ ఘనత సాధించింది. అయితే చిన్నారులకు కూడా కరోనా వ్యాక్సిన్లు వేయాలా వద్దా అనే అంశంపై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. మరో రెండు వారాల్లో అత్యున్నత స్థాయి సలహా కమిటీ సమావేశం కానుంది. పిల్లలకు వ్యాక్సిన్లు, పెద్దలకు బూస్టర్ డోస్లపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. 2022 జనవరి నుంచి వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు, మార్చి నుంచి చిన్నారులందరికీ వ్యాక్సిన్లు వేయాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా చాలా దేశాల్లో రెండు డోస్లు వేసే వారికి అదనంగా బూస్టర్ డోస్ ఇస్తున్నారని కేంద్రం దృష్టి సారించింది.
Latest News