by సూర్య | Tue, Nov 23, 2021, 08:41 AM
మరో కీలక నిర్ణయం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏపీ శాసన మండలి చేసిన తీర్మానాన్ని తిప్పికొడుతున్నట్లు తెలుస్తోంది. గతేడాది జనవరిలో శాసనసభలో శాసనమండలి రద్దు తీర్మానాన్ని సీఎం జగన్ ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో 132 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఒక జనసేన ఎమ్మెల్యే తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. అప్పటి అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ హాజరుకాలేదు. తీర్మానానికి వ్యతిరేకంగా ఓట్లు లేవు. దాంతో ఆ రోజు శాసనమండలి రద్దు తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించారు. అయితే ఈ తీర్మానాన్ని ఉపసంహరించుకుంటూ ఏపీ ప్రభుత్వం మరో తీర్మానం తీసుకొచ్చే అవకాశం ఉంది. ఏపీలో సంచలనం సృష్టించిన 3 రాజధానుల చట్టాన్ని ఏపీ ప్రభుత్వం సోమవారం కూడా ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. అయితే, మరోసారి మూడు రాజధానుల చట్టాన్ని కొన్ని మార్పులతో తీసుకువస్తామని సీఎం జగన్ చెప్పారు.
Latest News