ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

by సూర్య | Tue, Nov 23, 2021, 08:25 AM

ఇతర రాష్ట్రాల్లోనూ పాగా వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ యోచిస్తోంది. పంజాబ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమైంది. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ లోని మోగాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి పంజాబ్ లో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా తాము అధికారంలోకి రాగానే పంజాబ్‌లో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1000 ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో పింఛన్లు పొందుతున్న మహిళలు అదనంగా రూ.1000 పొందవచ్చని తెలిపారు. ప్రతి ఇంటికి 300 యూనిట్ల విద్యుత్తు ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చారు. వ్యాధులకు చికిత్స, మందులు ఉచితంగా అందజేస్తామని ప్రకటించారు.

Latest News

 
జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత Fri, Mar 29, 2024, 03:41 PM
దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు Fri, Mar 29, 2024, 03:07 PM
విజయనగరం జిల్లాలో విషాదం Fri, Mar 29, 2024, 02:58 PM
వైసీపీ నుంచి టీడీపీలోకి కీలక నేత జంప్ Fri, Mar 29, 2024, 02:55 PM
బాబు చేసిన కుట్రలో బీజేపీ పడింది Fri, Mar 29, 2024, 02:54 PM