by సూర్య | Mon, Nov 22, 2021, 11:33 AM
కాసేపట్లో ఏపీ కేబినేట్ అత్యవసర సమావేశం కానుంది. 3 రాజధానుల అంశం పై కీలక నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. మూడు రాజధానులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న బిల్లును వెనక్కి తీసుకుంటారని తెలుస్తోంది. కొన్ని మార్పులతో సభలో మళ్లీ 3 రాజధానుల బిల్లు పెడుతారని తెలుస్తోంది. అమరావతి రైతుల పాదయాత్రతో ప్రభుత్వం పై వ్యతిరేకత ఎక్కువ కావడంతో ఏపీ సర్కార్ 3 రాజధానుల పై పునరాలోచన చేస్తుందని చర్చ జరుగుతోంది. ఏదేమైనా మరి కాసేపట్లో 3 రాజధానులకు సంబంధించి కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది.
Latest News