రాడ్లతో దాడి.. ఒకరికి తీవ్రగాయాలు

by సూర్య | Mon, Nov 22, 2021, 09:26 AM

అద్దంకి నార్కట్‌పల్లి రోడ్డులో శివారులోని స్థూపం సమీపంలో వ్యక్తిపై నలుగురు వ్యక్తులు ఇనుపరాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన  చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమ్మలచెరువు గ్రామానికి చెందిన షేక్ సైదా ద్విచక్రవాహనంపై పట్టణానికి తిరిగి వస్తున్నాడు. స్థూపం వద్దకు వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన చింతలకాయ శివారెడ్డికి కారులో వచ్చిన మరో ముగ్గురు వ్యక్తులు ద్విచక్రవాహనాన్ని అడ్డగించారు. రోడ్డు పక్కన పడేసిన సైదాపై నలుగురు వ్యక్తులు రాడ్లతో దాడి చేశారు. స్థానికులు గమనించి అడ్డుకోవడంతో వారు అక్కడి నుంచి కారులో పరారయ్యారు. తీవ్ర గాయాలపాలైన అతడిని పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి, ఆస్పత్రికి వెళ్లి దాడి ఘటనపై వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. బాధితురాలితో మాట్లాడి కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM