by సూర్య | Mon, Nov 22, 2021, 08:37 AM
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తమిళనాడు, ఏపీలో భారీ వర్షాలు కురిశాయి. ఇప్పటికే వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గ్రామాల్లోకి నీరు చేరడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో ఏపీ అతలాకుతలం అవుతుండగా మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ అండమాన్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అయితే ఇది కాస్త తగ్గుముఖం పట్టి పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 26 నుంచి డిసెంబర్ 2 వరకు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.నెల్లూరు, కడప, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Latest News