by సూర్య | Mon, Nov 22, 2021, 08:18 AM
గడిచిన 24 గంటల్లో ఏపీలో 24,659 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 174 పాజిటివ్గా తేలింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 32, పశ్చిమగోదావరి జిల్లాలో 31, చిత్తూరు జిల్లాలో 29, గుంటూరు జిల్లాలో 26 కొత్త కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో కొత్త కేసులు నమోదు కాలేదు. అదే సమయంలో 301 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,71,244 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 20,54,553 మంది కోలుకున్నారు. మరో 2,265 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 14,426కి చేరింది.
Latest News