న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం

by సూర్య | Mon, Nov 22, 2021, 08:14 AM

మూడు టీ20ల సిరీస్‌ను భారత క్రికెట్ జట్టు క్లీన్ స్వీప్ చేసింది. న్యూజిలాండ్‌పై భారత్ 73 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ అందుకోలేకపోయింది. దీంతో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. న్యూజిలాండ్ 17.2 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్ ఆరంభంలోనే న్యూజిలాండ్ తడబడింది. బౌలర్ అక్షర్ పటేల్ తొలి ఓవర్ లోనే రెండు వికెట్లు తీసి న్యూజిలాండ్ ను మట్టికరిపించాడు. ఓపెనర్ డారిల్ మిచెల్ (5) 21 పరుగుల వద్ద అక్షర్ పటేల్ బౌలింగ్ లో హర్షల్ పటేల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మార్క్ చాప్‌మన్ డకౌట్ అయ్యాడు. న్యూజిలాండ్ 10.3 ఓవర్ల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. మార్టిన్ గప్టిల్ 36 బంతుల్లో 51 పరుగులు చేసి ఔటయ్యాడు. న్యూజిలాండ్ 4.4 ఓవర్ల వద్ద 30 పరుగులు చేసి మూడో వికెట్ కోల్పోయింది. గ్లెన్ ఫిలిప్స్ నాలుగు పరుగుల వద్ద అక్షర్ పటేల్ బౌలింగ్ లో ఔటయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్‌లో చాహల్‌కి క్యాచ్ ఇచ్చి మార్టిన్ గప్టిల్ ఔటయ్యాడు.

Latest News

 
బస్సు బోల్తా.. డ్రైవర్ తో సహా ఆరుగురుకి గాయాలు Thu, Apr 25, 2024, 12:20 PM
వైసిపి టిడిపి నుండి 60 కుటుంబాలు కాంగ్రెస్ లోకి చేరిక Thu, Apr 25, 2024, 12:18 PM
వైసిపి నుండి 10 కుటుంబాలు టిడిపిలోకి చేరుకా Thu, Apr 25, 2024, 12:10 PM
వైఎస్సార్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాగభూషణ Thu, Apr 25, 2024, 12:09 PM
కొనసాగిన నామినేషన్ల పర్వం Thu, Apr 25, 2024, 12:06 PM