by సూర్య | Sun, Nov 21, 2021, 08:48 AM
గడిచిన 24 గంటల్లో ఏపీలో 25,197 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 164 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 32, విశాఖపట్నం జిల్లాలో 24, గుంటూరు జిల్లాలో 22 కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో అత్యల్పంగా, కర్నూలు జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కోవిడ్ ప్రభావం నుండి 196 మంది కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,71,070 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 20,54,252 మంది కోలుకున్నారు. మరో 2,392 మంది చికిత్స పొందుతున్నారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 14,426కి చేరింది.
Latest News