by సూర్య | Sat, Nov 20, 2021, 09:55 PM
గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావును మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్టీఆర్ కుటుంబాన్ని మోసం చేస్తున్నారని లక్ష్మీపార్వతి ఆరోపించారు.చంద్రబాబు ఎప్పటిలాగే తన కుటుంబానికి అబద్ధాలు చెప్పారన్నారు. అసెంబ్లీలో ఏమీ జరగనప్పటికీ డ్రామా చేసి సీన్ క్రియేట్ చేశారని, ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు మద్దతివ్వడం శోచనీయమని ఆమె వ్యాఖ్యానించారు.కుటుంబ సభ్యులు ఇలాంటి చీప్ ట్రిక్స్లో ఎలా పడిపోతారని ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆమె, చంద్రబాబు మాటలను నమ్మవద్దని, కళ్లు తెరవాలని సూచించారు.
Latest News