by సూర్య | Sat, Nov 20, 2021, 03:17 PM
కేరళ రాష్ట్రం లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.పంబానదికి వరద ఉధృతి పెరిగింది. దీంతో చెరువులు నదులు పొంగి పొర్లుతున్నాయి.శబరిమల ఆలయ దర్శనాలపై పడింది. వరద పెరగడంతో శబరిమల ఆలయంలోకి భక్తుల దర్శనాలను నిలిపివేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.వరద తగ్గిన తరువాతే ఆలయంలోకి భక్తులను అనుమతిస్తామని కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పంబానది పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అటు కర్ణాటక, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తుండటంతో కేరళలోని నదులకు వరద చేరింది.
Latest News