by సూర్య | Sat, Nov 20, 2021, 03:00 PM
కడప జిల్లాను అకాల వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపిలేని వర్షాలతో వందాలాది మంది నిరాశ్రయులయ్యారు. చాలా గ్రామాల్లో అంధకారం అలముకొంది. రాజంపేట మండలం రామాపురం గ్రామం వరదకు పూర్తిగా నీటమునిగింది. ఇళ్లల్లోని సామగ్రి కొట్టుకుపోవడంతో గ్రామస్థులు ఆరుబయటే కాలం వెల్లదీస్తున్నారు. స్థానిక అధికారులు ఎవరూ తమను పట్టించుకోలేదని.కనీసం ముందస్తు హెచ్చరికలు కూడా చేయలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
Latest News