by సూర్య | Sat, Nov 20, 2021, 08:29 AM
గడిచిన 24 గంటల్లో ఏపీలో 31,040 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 168 పాజిటివ్గా తేలింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 35, కృష్ణా జిల్లాలో 26, విశాఖపట్నంలో 22, గుంటూరు జిల్లాలో 20 కొత్త కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో కొత్త కేసులు నమోదు కాలేదు. అదే సమయంలో 301 మంది కరోనా నుండి కోలుకున్నారు మరియు ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,70,906 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,54,056 మంది కరోనా నుంచి విముక్తి పొందారు. మరో 2,425 మంది చికిత్స పొందుతున్నారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 14,425కి చేరింది.
Latest News