by సూర్య | Sat, Nov 20, 2021, 08:13 AM
వైసీపీ పార్టీలో విషాదం నెలకొంది. నిన్నరాత్రి వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ కరీమున్నీసా (65) గుండెపోటుతో మృతి చెందారు. నిన్న రాత్రి ఆమె అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు ఆమెను విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కరీమున్నీసా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కరీమున్నీసాకు మైనార్టీల తరఫున ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా అవకాశం కల్పించారు.
Latest News