by సూర్య | Fri, Nov 19, 2021, 10:27 PM
ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సీఎం జగన్ వరద ప్రాంత జిల్లాల్లో సర్వే నిర్వహించనున్నారు. భారీ వర్షాలు పడుతున్న నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో రేపు సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. రేపు ఉదయం తాడేపల్లిలో ఆ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని తెలుసుకోనున్నారు. ఆ తరువాత గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కడప వెళ్లనున్నారు . అక్కడ్నించి హెలికాప్టర్ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు.
Latest News