by సూర్య | Fri, Nov 19, 2021, 09:12 PM
ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సీఎం జగన్కు ప్రధాని మోదీ ఫోన్ చేసారు. కేంద్రం నుంచి అన్ని విధాలా సహాయం మరియు సహకారం అందిస్తామని ప్రధాని ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు.మోడీ ట్వీట్లో, "రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ గారితో మాట్లాడాను. కేంద్రం నుండి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అన్నమయ్య ప్రాజెక్టు బండ్ తెగిపోవడంతో చెయ్యేరు వాగులో ఒక్కసారిగా వరద వచ్చి గుండ్లూరు, శేషమాంబాపురం, మందపల్లెతో పాటు కొన్ని గ్రామాలు ముంపునకు గురయ్యాయని అధికార వర్గాలు తెలిపాయి.
Latest News