by సూర్య | Fri, Nov 19, 2021, 09:05 PM
ఆంధ్రప్రదేశ్లో శుక్రవారం కురుస్తున్న భారీ వర్షాలు 14 మందిని పొట్టన పెట్టుకున్నాయి. కడప జిల్లాలో దాదాపు 30 మంది గల్లంతైనట్లు సమాచారం. ఈ ముప్పై మందిలో 12 మంది మృతదేహాలను భారీ వరదల్లో గుర్తించారు. వీరిలో ముగ్గురు కండక్టర్గా, ఇద్దరు బస్సు ప్రయాణికులుగా గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా మరో 18 మంది ఆచూకీ నిర్ధారించాల్సి ఉంది. చిత్తూరులో మరో ఐదుగురు గల్లంతయ్యారు. అనంతపురం జిల్లా రామగిరి మండలం గంటిమర్రిలో ఓ మహిళ, పురుషుడి మృతదేహం లభ్యమైనట్లు జిల్లా అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.2వేలు ఇవ్వాలని సూచించారు.
Latest News