by సూర్య | Fri, Nov 19, 2021, 12:26 PM
ఏపీ సీఎం జగన్ భారీ వర్షాలు, వరదలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. చెరువుల్లో గండ్లు పడిన చోట వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తిరుపతిలో వరద నీటి నిల్వకు గల కారణాలను అధ్యయనం చేయాలన్నారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.2వేలు అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. వర్షాలు కురిసిన తర్వాత వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
Latest News