by సూర్య | Fri, Nov 19, 2021, 10:37 AM
భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని తిరుమల *రెండు ఘాట్ రోడ్లను మూసివేయాలని* నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఘాట్ రోడ్లను తెరిచే సమయాన్ని మళ్లీ తెలియజేయనున్నట్టు పేర్కొంది. ఇప్పటికే 17,18 తేదీల్లో నడకదారులను మూసిన టీటీడీ 19న కూడా రెండు నడకదార్లను మూస్తున్నట్టు తెలిపింది.
Latest News