by సూర్య | Thu, Nov 18, 2021, 07:38 PM
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ అనంతపురం జిల్లా పుట్టపర్తి లో పర్యటించనున్నారు. భగవాన్ సత్యసాయి వేడుకలలో పాల్గొనడానికి జస్టిస్ ఎన్.వి. రమణ పుట్టపర్తి రానున్నారు. . 21వ తేదీన బెంగళూరు విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు.అనంతరం పుట్టపర్తికి చేరుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 22న సత్యసాయి విశ్వవిద్యాలయం 40వ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరవుతారు. అనంతరం పుట్టపర్తి విమానాశ్రయం నుంచి బెంగళూరుకు తిరిగి బయలుదేరి వెళతారు.
Latest News