by సూర్య | Thu, Nov 18, 2021, 06:00 PM
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ రచయిత్రి మరో అవతారం ఎత్తింది. 2010 నక్సల్స్ దాడిపై తాజాగా పుస్తకం ను రాసింది. 2010లో చత్తీస్ గఢ్ లోని దంతేవాడలో భద్రతా బలగాలకు చెందిన 76 మంది బలైన ఘటన కేంద్రబిందువుగా ఆమె లాల్ సలాం అనే పుస్తకం రాశారు. ఈ పుస్తకం నవంబరు 29న మార్కెట్లోకి రానుంది. వెస్ట్ ల్యాండ్ పబ్లిషింగ్ సంస్థ లాల్ సలాం పుస్తకాన్ని ముద్రించింది. తాజాగా ఈ పుస్తకం కవర్ పేజీని స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన పుస్తకం పాఠకుల ఆదరణకు నోచుకుంటుందన్న నమ్మకం ఉందని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆశాభావం వ్యక్తం చేసారు.
Latest News